బెంగళూరులో వేగంగా వచ్చిన SUV Jumps Divider...క్యాబ్‌పై పడింది

ABN , First Publish Date - 2021-11-19T13:49:31+05:30 IST

అతి వేగంగా వస్తున్న ఎస్‌యూవీ డివైడర్ పై నుంచి దూకి రామ్ క్యాబ్‌పై పడి ముగ్గురు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో గురువారం రాత్రి జరిగింది...

బెంగళూరులో వేగంగా వచ్చిన SUV Jumps Divider...క్యాబ్‌పై పడింది

ముగ్గురి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

బెంగళూరు:అతి వేగంగా వస్తున్న ఎస్‌యూవీ డివైడర్ పై నుంచి దూకి రామ్ క్యాబ్‌పై పడి ముగ్గురు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో గురువారం రాత్రి జరిగింది. బెంగళూరు నగరంలోని చిక్కజాల పోలీస్‌ పరిధిలోని విద్యానగర్‌ క్రాస్‌ సమీపంలోని విమానాశ్రయం రోడ్డులో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఒక మహిళతో సహా క్యాబ్‌లోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఎస్‌యూవీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో క్యాబ్ పూర్తిగా దెబ్బతింది. ఈ రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెప్పారు.ఈ ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


Updated Date - 2021-11-19T13:49:31+05:30 IST