క్రీడల్లో రాణించాలి
ABN , First Publish Date - 2020-11-27T04:35:55+05:30 IST
క్రీడల్లో రాణించాలి
- ప్రిన్సిపాల్ అపర్ణ
షాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ అన్నారు. షాబాద్ మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన అంకిత అనే విద్యార్థిని ఈ మధ్య జరిగిన చార్మినార్ జోనల్ అండర్16 బాలబాలికల క్రీడాపోటీల్లో విజేతగా నిలిచింది. ఈ బాలిక కొత్తగడి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అంకిత చెస్ పోటీల్లో విజేతగా నిలువడంతో గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ, వైస్ప్రిన్సిపాల్ స్రవంతి విద్యార్థినిని సన్మానించి నగదును అందజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే మరింత ఉన్నతంగా ఎదుగుతారని సూచించారు.