అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతగా నిలవాలి

ABN , First Publish Date - 2020-12-03T06:11:59+05:30 IST

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతగా నిలవాలి

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతగా నిలవాలి

- కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటఅర్బన్‌/టౌన్‌, డిసెంబరు 2: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి సిద్దిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని క్రీడాకారులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీగ్రౌండ్‌లో బుధవారం సాయంత్రం అండర్‌-14, అండర్‌-19 ఫుట్‌ బాల్‌ క్రీడల కోసం శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డితో కలిసి కబడ్డీ క్రీడాపోటీల కోసం ఏర్పాటు చేసిన లాంగ్‌ టర్మ్‌ శిక్షణా శిబిరాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు సిద్దిపేట-గజ్వేల్‌ నియోజకవర్గ జట్ల మధ్య కబడ్డీ పోటీలను కాసేపు వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని వివిధ రంగాలైన కబడ్డీ, ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ఉచిత శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్న కబడ్డీ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి శివకుమార్‌, ఫుట్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధి అక్బర్‌ ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ‘సుడా’ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





Updated Date - 2020-12-03T06:11:59+05:30 IST