మహాశివరాత్రి రోజు నైట్‌షెటిల్‌ టోర్నమెంట్‌

ABN , First Publish Date - 2021-03-03T05:30:00+05:30 IST

మహాశివరాత్రి రోజున హయత్‌నగర్‌ పాత రోడ్డులోని ఎస్‌వీఎస్‌ గార్డెన్‌లో గజ్జి యాదయ్య, రాజమ్మ మెమోరియల్‌ స్మారక నైట్‌ షెటిల్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు గజ్జి నర్సింహయాదవ్‌ తెలిపారు.

మహాశివరాత్రి రోజు నైట్‌షెటిల్‌ టోర్నమెంట్‌

 హయత్‌నగర్‌, మార్చ్‌ 3 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి రోజున హయత్‌నగర్‌ పాత రోడ్డులోని ఎస్‌వీఎస్‌ గార్డెన్‌లో గజ్జి యాదయ్య, రాజమ్మ మెమోరియల్‌  స్మారక నైట్‌ షెటిల్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు గజ్జి నర్సింహయాదవ్‌ తెలిపారు. 11న సాయంత్రం 5గంటల నుంచి పోటీలు ప్రారంభమై 12న ఉదయం 6.30గంటల వరకు జరుగుతాయని తెలిపారు. రూ. 600 ఎంట్రీ ఫీజు చెల్లించి టీం పేరును ఈ నెల 10లోగా నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. మొదటి బహుమతి రూ. 20 వేలు, ద్వితీయ బహుమతి రూ. 10 వేలు, తృతీయ బహుమతి రూ. 5 వేలతో పాటు ట్రోఫీని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వివరాల కోసం కె.రాజారావు- 97045 41579, కౌషిక్‌- 99596 47689, జీఎన్‌ యాదవ్‌- 98499 56055లను సంప్రదించాలని కోరారు.  


Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST