క్రీడాకారిణి రూ.15 లక్షల సైకిల్‌ బహుమతి

ABN , First Publish Date - 2022-07-07T14:48:13+05:30 IST

తూత్తుకుడి జిల్లాకు చెందిన క్రీడాకారిణి శ్రీమతికి రూ.15 లక్షల విలువైన సైకిల్‌ను డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి బహుమతిగా అందించారు. జిల్లాలోని

క్రీడాకారిణి రూ.15 లక్షల సైకిల్‌ బహుమతి

ప్యారీస్‌(చెన్నై), జూలై 6: తూత్తుకుడి జిల్లాకు చెందిన క్రీడాకారిణి శ్రీమతికి రూ.15 లక్షల విలువైన సైకిల్‌ను డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి బహుమతిగా అందించారు. జిల్లాలోని ఒట్టపిడారం సమీపంలోని ముప్పిలివిట్టి గ్రామానికి చెందిన శ్రీమతి జూన్‌లో ఢిల్లీలో జరిగిన ఆసియా ట్రాక్‌ సైకిల్‌ పోటీల్లో పాల్గొని తృతీయస్థానంలో నిలిచి, కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సమాచారం అందుకున్న కనిమొళి క్రీడాకారిణి ఆర్థికపరిస్థితులను తెలుసుకున్నారు. బుధవారం ఆమెను తూత్తుకుడిలోని తన కార్యాలయానికి పిలిపించిన కనిమొళి.. రూ. 15 లక్షలతో కొనుగోలు చేసిన సైకిల్‌ను ఆమెను బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతా జీవన్‌, క్రీడావిభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T14:48:13+05:30 IST