రేంజ్‌ పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-23T04:49:22+05:30 IST

గుంటూరు రేంజ్‌ పరిధిలోని రేంజ్‌ పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ శనివారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది.

రేంజ్‌ పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం
క్రీడా జ్యోతి వెలిగించి స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభిస్తున్న డీఐజీ త్రివిక్రమవర్మ

  హాజరైన డీఐజీ, ముగ్గురు ఎస్పీలు


గుంటూరు, జనవరి 22: గుంటూరు రేంజ్‌ పరిధిలోని రేంజ్‌ పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ శనివారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ క్రీడాజ్యోతి వెలిగించి బెలూన్లు ఎగురవేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు గుంటూరు అర్బన్‌, రూరల్‌తోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల జట్లు హాజరయ్యాయి. ఈ సందర్భంగా టగ్‌ ఆఫ్‌ వార్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, హైజంప్‌, లాంగ్‌ జంప్‌, హ్యామర్‌ త్రో, 200, 400 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ముందుగా క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో డీఐజీ త్రివిక్రమవర్మతోపాటు గుంటూరు అర్బన్‌, రూరల్‌, నెల్లూరు ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్‌, విశాల్‌గున్నీ, విజయరావుతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. 

Updated Date - 2022-01-23T04:49:22+05:30 IST