తెలంగాణ క్రీడాకారులు గర్వకారణం
ABN , First Publish Date - 2022-08-11T06:18:13+05:30 IST
కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు సాధించడం
అఫ్జల్గంజ్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గోషామహల్ టీఆర్ఎ్సవీ సీనియర్ నాయకులు నీరుడు సాయికుమార్, జయశంకర్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్ రెడ్డిని గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాయికుమార్, జయశంకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ల ఆదేశాల మేరకు ఇటీవల ఇంగ్లాండ్ బర్మింగ్హోమ్లో జరిగిన క్రీడల్లో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు వారి వెన్నంటే ఉండి వారి విజయానికి దోహదపడిన చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, మెట్టు శివ, నాగేందర్, మాజీ రంజీ ట్రోపీ క్రీడాకారుడు బి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.