గ్రామాల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
ABN , First Publish Date - 2021-05-09T04:58:13+05:30 IST
కరోనా మహమ్మా రి గ్రామాలపై పంజా విసురు తుండడంతో పం చాయతీ కార్యదర్శి విజయకుమార్ ఆధ్వర్యంలో సచి వాలయ సిబ్బంది గ్రామాల్లో పారి శుధ్య పనులు చేపట్టారు.
గోపవరం, మే 8: కరోనా మహమ్మా రి గ్రామాలపై పంజా విసురు తుండడంతో పం చాయతీ కార్యదర్శి విజయకుమార్ ఆధ్వర్యంలో సచి వాలయ సిబ్బంది గ్రామాల్లో పారి శుధ్య పనులు చేపట్టారు. ట్రాక్టర్లతో పెద్దగోపవరం ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీల వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచి కారీ చేయించారు. బ్లీచింగ్ పౌడరును వీధుల్లో చల్లించారు. కొవిడ్ పట్ల గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. వెంకటసుబ్బయ్య, రమణ, సుబ్బరా యుడు, గ్రీన అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు.
యర్రగుడిపల్లెలో....
పులివెందుల రూరల్, మే 8: రోజురోజుకూ విజృంభిస్తున్న వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వైసీపీ సీనియర్ నేతలు కృష్ణమూర్తి, సూర్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం యర్రగుడిపల్లెలో కౌన్సిలర్ పురుషోత్తం ఆధ్వర్యంలో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు విజయుడు, అజరయ్య, డేనియల్బాబు పాల్గొన్నారు.