బావిలో మునిగి శీనయ్య మృతి

ABN , First Publish Date - 2020-12-04T02:27:41+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలకు పొల్లాలో ఉన్న కామిరెడ్డి బావి పూర్తిగా నిండి పోయింది. ఎంతో అనుభవం ఉన్నాకానీ శీనయ్య

బావిలో మునిగి శీనయ్య మృతి
: శీనయ్య మృతదేహం

బిట్రగుంట, డిసెంబరు 3: ఇటీవల కురిసిన వర్షాలకు పొల్లాలో ఉన్న కామిరెడ్డి బావి పూర్తిగా నిండి పోయింది. ఎంతో అనుభవం ఉన్నాకానీ శీనయ్య పూడికలో చిక్కుకొని గురువారం శవమై తేలాడు. బోగోలు మండలం నాగులవరం పంచాయతీ చెన్నారెడ్డిపాలెం పాతూరుకు చెందిన చేరెడ్డి శీనయ్య (36) అలియాస్‌ శ్రీనివాసులురెడ్డి బుధవారం స్నేహితుడు రమేష్‌ రెడ్డి కౌలుకు చేస్తున్న పొల్లాలోని బావిలో మోటారు తీయడానికి వెళ్లి నీట మునిగి పోయాడు. తెల్లవారు జామున మృతదేహం పైకి తేలడంతో తహసీల్దారు ఆదేశాల మేరకు వీఆర్వో బాలనరసింహం గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని  కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  ఎస్సై సుమన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-04T02:27:41+05:30 IST