పంజాబ్ను ఓడించిన హైదరాబాద్ ఖాతాలో ఘనమైన రికార్డు
ABN , First Publish Date - 2022-04-18T02:18:58+05:30 IST
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఘనత సాధించింది
ముంబై: పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇది ఆ జట్టుకు నాలుగో విజయం. ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓ జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి.
అయిడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్ అజేయంగా 75 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ విజయంతో హైదరాబాద్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఓడిన పంజాబ్ ఏడో స్థానానికి దిగజారింది.