టాప్‌ 100లో శ్రీ చైతన్యకు 22 ర్యాంకులు

ABN , First Publish Date - 2022-08-09T09:02:52+05:30 IST

జేఈఈ మెయిన్‌లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు.

టాప్‌ 100లో శ్రీ చైతన్యకు 22 ర్యాంకులు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. ఓపెన్‌ క్యాటగిరిలో పదిలోపు 4, వంద లోపు 22, వెయ్యిలోపు 601 ర్యాంకులు సాధించారని సోమవారం మీడియాతో పేర్కొన్నారు. ఓబీసీ క్యాటగిరిలో హిమవంశీ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించారని, ఓపెన్‌ క్యాటగిరిలో మృణాల్‌ గార్గ్‌ 5, రవికిషోర్‌ 6, హిమవంశీ 7, జలజాక్షి 9వ ర్యాంకు సాధించారని ఆమె తెలిపారు. విద్యార్థులను అభినందించారు.    


Updated Date - 2022-08-09T09:02:52+05:30 IST