కాణిపాకంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T05:16:51+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ గోశాలలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.

కాణిపాకంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ఉట్టి కొడుతున్న చైర్మన్‌, ఈవో

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 19: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ గోశాలలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాణిపాకానికి చెందిన ఎ.ధనంజయయాదవ్‌, ఎస్‌.రాజేంద్రయాదవ్‌ ఉభయదారులుగా వ్యవహరించారు. సంప్రదాయం ప్రకారం ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, సిబ్బంది పూజా సామగ్రిని గోశాలకు తీసుకొచ్చారు. గోవు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ గోవులకు పూజలు చేశారు. గోవులకు అరటి పండు, దాణా, చెరకు ఆకనుఉ భక్తులు పెట్టారు. అనంతరం గోశాల ప్రాంగణంలో ఆలయ చైర్మన్‌, అధికారులు ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనరు కస్తూరి, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, హేమమాలిని, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:16:51+05:30 IST