వారిని కాల్చిపారేయండి.. Sri Lanka త్రివిధ దళాలకు రక్షణశాఖ కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-05-11T02:51:34+05:30 IST

కొలంబో : తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగిన అల్లర్లు, తీవ్ర పర్యవసనాల నేపథ్యంలో శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

వారిని కాల్చిపారేయండి.. Sri Lanka  త్రివిధ దళాలకు రక్షణశాఖ కీలక ఆదేశాలు

కొలంబో : తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగిన అల్లర్లు, తీవ్ర పర్యవసనాల నేపథ్యంలో శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆస్తులకు నష్టం లేదా ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్న వ్యక్తులను కాల్చిపడేయాలని త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ ప్రతినిధి నలిన్ హెరాత్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. సోమవారం నుంచి జరుగుతున్న అల్లర్లతో ద్వీప దేశం శ్రీలంక అతలాకుతలమవుతోంది. అల్లర్లలో ఇప్పటికే 8 మందికిపైగా చనిపోగా.. 200లకుపైగా మంది గాయపడ్డారు.


మరోవైపు తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో వారెంట్ లేకుండానే వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు మిలటరీ, పోలీసులకు ఆ దేశం ఎమర్జెన్సీ అధికారులు అప్పగించింది. సోమవారం జరిగిన తీవ్రమైన అల్లర్ల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. కాగా సంక్షోభంలో ఉన్న శ్రీలంకను కొత్త ప్రభుత్వం నడిపించాలని నిరసనకారులతోపాటు కీలకమైన వాణిజ్య గ్రూపులు కూడా కోరుతున్నాయి. 

Read more