AP: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-02T16:44:06+05:30 IST

జిల్లాలోని కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

AP: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

శ్రీ సత్య సాయి: జిల్లాలోని కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రామగిరి మండలం కుంటీమద్ధి గ్రామానికి చెందిన అమర్నాథ్(28) అక్కడికక్కడే మృతి చెందాడు. అమర్నాథ్ భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-05-02T16:44:06+05:30 IST