శ్రీవారి ఆలయానికి వెండి దీపం కుందులు అందజేత
ABN , First Publish Date - 2022-05-29T06:31:23+05:30 IST
స్థానిక డైలీ మార్కెట్లోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టణానికి చెందిన వ్యాపారి బంగారు వెంకట సుబ్రహ్మణ్యం గుప్త (బుజ్జి) సుమారు 25,000 విలువైన రెండు దీపపు కుందులు శనివారం అందజేశారు.
పాలకొల్లుఅర్బన్, మే 28 : స్థానిక డైలీ మార్కెట్లోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టణానికి చెందిన వ్యాపారి బంగారు వెంకట సుబ్రహ్మణ్యం గుప్త (బుజ్జి) సుమారు 25,000 విలువైన రెండు దీపపు కుందులు శనివారం అందజేశారు. బొడ్డు చంద్రశేఖర్ అనే భక్తులు స్వామికి వెండి మకర తోరణం తయారీ నిమిత్తం 500 గ్రాముల వెండి అందజేశారు. ఆలయ చైర్మన్ జోగి వెంకటేశ్వరరావు, ట్రస్టీలు ఆనందం రామకృష్ణ, కెల్లా సుభద్ర సమక్షంలో ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావుకు అందజేశారు. ఆలయ అర్చకులు గోవర్ధం కృష్ణచైతన్య, భక్తులు పాల్గొన్నారు.