వైభవంగా శ్రీవారి తూర్పు రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-06-21T03:20:19+05:30 IST

బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంపై వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన తూర్పు రాజగోపురం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా జరిగింది.

వైభవంగా శ్రీవారి తూర్పు రాజగోపురం  నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన శిలలతో ప్రదక్షణ చేస్తున్న సుకుమార్‌రెడ్డి, మిత్ర బృందం

బిట్రగుంట, జూన్‌ 20: బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంపై వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన తూర్పు రాజగోపురం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా జరిగింది. వైకాన ఆగమ పండితులు వంశీకృష్ణమాచార్యులు రుత్విక్‌ బృందచే శాస్త్రోక్తంగా పున్యాహవచనం, వాస్తు హోమం, జలాధివాస ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ పాలక మండలి చైర్మన్‌ శ్రీరాం మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాణ దాతలు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బాలమురళీరెడ్డి దంపతులు శంకుస్థాపన శిలలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. బిలకూట క్షేత్రం గోవింద నామ స్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా కావలి ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ స్వామి వారి అనుగ్రహం, ఎమ్యెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అదేశాలు, స్నేహితుల సహాయ సహకారాలతో సుమారు రూ.1.70 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే నాలుకోట్లపై చిలుకుతో శ్రీవారి పుష్కరణి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫ్కాప్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌ బాబు, నేతలు కర్తం సురేంద్రరెడ్డి, ఆర్‌.వెంకటేశ్వర్లు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T03:20:19+05:30 IST