శ్రీకాకుళంలో భారీ పేలుడు

ABN , First Publish Date - 2022-04-19T19:48:24+05:30 IST

జిల్లాలోని రణస్థలం మండలం జె.ఆర్.పురంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది.

శ్రీకాకుళంలో భారీ పేలుడు

శ్రీకాకుళం: జిల్లాలోని రణస్థలం మండలం జె.ఆర్.పురంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో యామల కామరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. పేలుడు ధాటికి  స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. అక్రమంగా బాణాసంచా తయారు చెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2022-04-19T19:48:24+05:30 IST