Srikakulamలో పట్టపగలే చైన్ స్నాచింగ్
ABN , First Publish Date - 2022-05-19T17:21:15+05:30 IST
పట్టణంలో పట్టపగలే దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు.
శ్రీకాకుళం: పట్టణంలో పట్టపగలే దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. సూర్యమహాల్ కూడలి నుండి పెద్దపాడు వెల్లే మార్గంలో సౌతిండియా షాపింగ్ మాల్ సమీపంలో భార్యాభర్తలు బండిపై వెళ్తుండగా...భార్య మెడ నుండి నల్లపూసల దండను దుండగులు తెంపుకెళ్లారు. బాధితులు శ్రీకాకుళం పట్టణం మేదర వీధికి చెందిన బోగి లక్ష్మణరావు దంపతులుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.