Srikakulam: రామచంద్రాపురం సర్పంచ్పై కాల్పులు
ABN , First Publish Date - 2022-01-19T13:17:22+05:30 IST
జిల్లాలోని పాత ఆర్టీవో కార్యాలయం వద్ద కాల్పుల కలకలం రేగింది.
శ్రీకాకుళం: జిల్లాలోని పాత ఆర్టీవో కార్యాలయం వద్ద కాల్పుల కలకలం రేగింది. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణపై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సర్పంచ్ తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.