Srikakulam: ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-06-21T16:39:05+05:30 IST
జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో రెండు రోజులుగా ఎలుగుబంటి హల్ చల్ చేస్తోంది.
శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో రెండు రోజులుగా ఎలుగుబంటి(Bear) హల్చల్ చేస్తోంది. ఎలుగు దాడిలో ఒకరు మృతి చెందగా నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. నిన్న జరిగిన ఘటనతో స్పందించిన అటవీశాఖ అధికారులు.. ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి ఉన్నట్లు గుర్తించారు. ఎలుగుబంటిని పట్టుకోవటానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎలుగుబంటి దాడులతో కిడిసింగి గ్రామం భయం గుప్పిట్లో ఉండిపోయింది.