Srikakulam: ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
ABN , First Publish Date - 2022-06-21T17:47:19+05:30 IST
జిల్లాలోని కిడిసింగిలోని గ్రామస్తులను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది.
శ్రీకాకుళం: జిల్లాలోని కిడిసింగిలోని గ్రామస్తులను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కిడిసింగిలో రెండ్రోజులుగా ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న జరిగిన ఘటనతో వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి ఉన్నట్లు గుర్తించిన రెస్క్యూ టీం.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.