శ్రీకాకుళంలో స్వల్ప భూప్రకంపనలు
ABN , First Publish Date - 2021-12-29T13:30:25+05:30 IST
జిల్లాలోని ఇచ్చాపురంలో స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి.
శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురంలో స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. దాదాపు రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.