శ్రీకాకుళం జిల్లాలో అధికారుల నిర్వాకం..

ABN , First Publish Date - 2020-07-06T22:11:05+05:30 IST

ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిండిలేక, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలేం జరిగిందంటే..

శ్రీకాకుళం జిల్లాలో అధికారుల నిర్వాకం..

శ్రీకాకుళం: ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిండిలేక, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని మెలియాపుట్టిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని దహనసంస్కారాలను టెక్కలికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించారు. దీంతో పై అధికారులు వారిని టెక్కలి అంబేద్కర్ భవన్‌లో క్వారంటైన్‌లో ఉంచారు. అయితే క్వారంటైన్‌లో ఉంచిన పారిశుద్ధ్య కార్మికుల అవసరాలను అధికారులు విస్మరించారు. కనీసం వారికి ఆహారం, నీళ్లు అందించలేదు. అయినవారు ఆదరించక, అధికారులు పట్టించుకోక కార్మికులు తిప్పలు పడుతున్నారు. 

Updated Date - 2020-07-06T22:11:05+05:30 IST