షటిల్స్ డబుల్స్లో విజేత శ్రీకాకుళం
ABN , First Publish Date - 2021-01-25T05:00:29+05:30 IST
పలాస రైల్వే ఇనిస్టిట్యూట్లో జరిగిన జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్లో శ్రీకాకుళం క్రీడాకారులు గెలుపొందారు.
పలాస: పలాస రైల్వే ఇనిస్టిట్యూట్లో జరిగిన జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్లో శ్రీకాకుళం క్రీడాకారులు గెలుపొందారు. ఆదివారం ముగింపు పోటీలు ఇక్కడ జరిగాయి. ఈ మేరకు డబుల్స్లో శ్రీకాకుళానికి చెందిన కె.విక్రాంత్, బి.రాజేష్లు ఎస్.మోహనరావు(పలాస), టి.తేజ (సోంపేట)పై 21-19, 19-21, 21-14తో గెలుపొందారు. సింగిల్స్లో తుదిపోరులో పీజీ సాయినాథ్ (శ్రీకాకుళం), వి.ప్రవీణ్ (పాతపట్నం), సాగర్, తేజ(కవిటి) తలపడనున్నారు. విజేతలకు మంత్రి అప్పలరాజు సతీమణి శ్రీదేవి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మూల మల్లికార్జునరావు, సీఈవో ఎస్.సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు.