Srilankaకు 100 టన్నుల బియ్యం వితరణ

ABN , First Publish Date - 2022-05-29T15:42:53+05:30 IST

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న శ్రీలంకను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలోని పలు సంస్థలు తమవంతుగా ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా

Srilankaకు 100 టన్నుల బియ్యం వితరణ

చెన్నై: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న శ్రీలంకను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలోని పలు సంస్థలు తమవంతుగా ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరుకు చెందిన ‘అమ్మ చారిటుబల్‌ ట్రస్టు’ కూడా శ్రీలంకకు 100 టన్నుల బియ్యం శ్రీలంక ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ మేరకు లేఖను చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హైకమిషర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరన్‌కు అమ్మ చారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధి శాండిల్య, సమన్వయకర్తగా వున్న టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి సభ్యుడు పీవీఆర్‌ కృష్ణారావు శుక్రవారం అందజేశారు. రోటరీ క్లబ్‌ భాగస్వామ్యంతో ఆ బియ్యాన్ని త్వరలోనే శ్రీలంకకు పంపించనున్నారు. 

Updated Date - 2022-05-29T15:42:53+05:30 IST