కనులపండువగా శ్రీనివాసుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-05-18T05:36:34+05:30 IST
కనులపండువగా శ్రీనివాసుడి కల్యాణం
- ఎమ్మెల్యే దంపతుల పూజలు
కేశంపేట, మే 17: కేశంపేట మండల ఎక్లా్సఖాన్పేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన చలువ పందిరిలోకి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, లక్ష్మమ్మ, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, కవిత దంపతులు మంటపానికి తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి, వైస్ఎంపీపీ అనురాధపర్వత్రెడ్డి, సర్పంచ్లు ఆంజనేయులు యాదవ్, నవీన్కుమార్, తలసాని వెంకట్రెడ్డి, కృష్ణయ్య, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నారాయణరెడ్డి, వర్కల లక్ష్మీనారాయణగౌడ్, మురళీధర్రెడ్డి, రంబల్నాయక్, యారం శేఖర్రెడ్డి, జమాల్ఖాన్, యాదయ్యచారి, యెన్నం మధుసూదన్రెడ్డి, వేణుగోపాలచారి, వెంకటే్షగౌడ్ పాల్గొన్నారు.
ఇన్ముల్నర్వలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
కొత్తూర్, మే 17: ఇన్ముల్నర్వలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సోమవారం రాత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైౖర్మన్ ఈట గణేష్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, వైస్ ఎంపీపీ శోభలింగంనాయక్, సర్పంచ్ అజయ్మిట్టునాయక్, ఉపసర్పంచ్ శ్రీరాములు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, నాయకులు మెండె కృష్ణ, పెంటనోళ్ల యాదగిరి, పెంటనోళ్ల నర్సింహ, రవికుమార్, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.