శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-23T15:04:47+05:30 IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,31,000 క్యూసెక్కులు,

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,31,000  క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,00,000 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 33 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1089.80  అడుగులు, 83.772  టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2021-07-23T15:04:47+05:30 IST