శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-10-23T18:10:12+05:30 IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 31,609 క్యూసెక్కులుగా ఉంది.
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 31,609 క్యూసెక్కులుగా ఉంది. 6 గేట్లు, కాలువలు, మిషన్ భగీరథ ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఔట్ ఫ్లో 31,609 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలకు చేరింది.