శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-15T16:55:51+05:30 IST

జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్: జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 8 గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 40378 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 15378 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-10-15T16:55:51+05:30 IST