America: చికాగోలోని హిందూ దేవాలయాన్ని సందర్శించిన శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు

ABN , First Publish Date - 2022-08-29T17:00:37+05:30 IST

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం బోర్డు సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి అమెరికాలోని హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ అధ్యక్షులు భీమారెడ్డి, గోపాల్ గోపాల్ శ్రీనివాసన్,

America: చికాగోలోని హిందూ దేవాలయాన్ని సందర్శించిన శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు

ఎన్నారై డెస్క్: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం బోర్డు సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి అమెరికాలోని హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ అధ్యక్షులు భీమారెడ్డి, గోపాల్ గోపాల్ శ్రీనివాసన్, ఆలయ మాజీ ఉపాధ్యక్షులు మెట్టుపల్లె జయదేవ రెడ్డి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ప్రెసిడెంట్ ఎలెక్ట్ మరమేశ్వరరెడ్డి తదితరులు  ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భీమారెడ్డి మాట్లాడారు. శ్రీశైల  దేవస్థాన బోర్డు సభ్యులు మొట్టమొదటిసారిగా చికాగో లెమాంట్ హిందూ దేవాలయాన్ని సందర్శించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. నరసింహారెడ్డి పర్యటన కారణంగా తమ వలంటీర్లలో చైతన్యాన్ని నింపిందని గోపాల్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నరసింహారెడ్డి స్పందిస్తూ.. శ్రీశైల దేవస్థానాన్ని ఒకసారి సందర్శించాల్సిందిగా సభికులను కోరారు. అంతేకాకుండా స్వామి వారి ప్రసాదాన్ని కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులకు అందజేశారు. 



ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేత కే సత్యనారాయణరెడ్డి, నాటా బోర్డు మెంబర్ లింగారెడ్డి గారి వెంటకరెడ్డి, హెచ్‌టీజీసీ వలంటీర్ కమిటీ అధ్యక్షులు శివదాసు, తానా ప్రతినిధులు క్రిష్ణ మోహన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో కార్యవర్గ సభ్యులు రమాకాంత్ రెడ్డి,  వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్ ప్రముఖులు లక్ష్మి నారాయణ, ఆది, శేషు, శషాంక్, శివారెడ్డి, హరి, వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-29T17:00:37+05:30 IST