Srisailamలో వడ్డీ వ్యాపారి బ్రహ్మారెడ్డి అరాచకం

ABN , First Publish Date - 2022-05-13T14:40:29+05:30 IST

జిల్లాలోని శ్రీశైలంలో వడ్డీ వ్యాపారి బ్రహ్మారెడ్డి అరాచకానికి పాల్పడ్డాడు.

Srisailamలో వడ్డీ వ్యాపారి బ్రహ్మారెడ్డి అరాచకం

నంద్యాల: జిల్లాలోని శ్రీశైలంలో వడ్డీ వ్యాపారి బ్రహ్మారెడ్డి అరాచకానికి పాల్పడ్డాడు. అప్పు డబ్బులు కట్టలేదని తన భర్తను వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశారంటూ జలదుర్గ అనే మహిళ ఆరోపించింది. రూ.20 లక్షల అప్పు డబ్బులు కడితేనే భర్తను విడిచి పెడతాను అని బ్రహ్మారెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. ఇప్పటికే లక్షా 90 వేల రూపాయలు బ్రహ్మారెడ్డి కొడుకు అకౌంట్లో వేసానని... మిగతా డబ్బులు ఇస్తామన్నా వినడం లేదని మహిళ వాపోయింది. ‘‘ఏడాది కాలంగా అప్పు చెల్లించాలని బ్రహ్మారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడు... పోలీసులకు చెప్తే నీ భర్త నీకు దక్కడాన్ని వార్నింగ్ ఇస్తున్నాడు’’ అంటూ బాధితురాలు జలదుర్గ ఆవేదన చెందారు. 


Read more