Srisailam projectకు వరద ఉధృతి... 10 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-08-10T17:52:02+05:30 IST
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు.
నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project)కు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 3, 64, 683 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 3,39,948 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 211.4759 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.