శ్రీశైలంలోని కళ్యాణకట్ట వద్ద భక్తుల ధర్నా
ABN , First Publish Date - 2021-06-21T13:57:07+05:30 IST
శ్రీశైలంలోని తలనీలాల కళ్యాణకట్ట వద్ద భక్తులు ధర్నాకు దిగారు.
కర్నూలు: శ్రీశైలంలోని తలనీలాల కళ్యాణకట్ట వద్ద భక్తులు ధర్నాకు దిగారు. కళ్యాణకట్టను వెంటనే తెరిపించాలని నినాదాలు చేస్తూ భక్తులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింతో పాటు.... అటు తెలంగాణలోనూ కర్ఫ్యూ ఎత్తివేయడంతో శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివచ్చారు. కొవిడ్ లాక్డౌన్ కారణంగా గత నెలరోజులుగా పాతాళగంగ పుణ్య స్నానాలకు అధికారులు అనుమతి నిరాకరించారు. అలాగే తలనీలాల కళ్యాణకట్ట మూతపడింది. కాగా నేటి నుంచి కర్ఫ్యూ సడలింపుతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో మూసివేసిన కళ్యాణకట్టను వెంటనే తెరిపించాలని కళ్యాణకట్ట వద్ద భక్తులు నినాదాలు చేస్తున్నారు. కళ్యాణకట్ట వద్ద భారీగా బైఠాయించి భక్తులు ధర్నాకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే కళ్యాణకట్ట వద్దకు చేరుకున్నారు. భక్తులకు నచ్చజెప్పేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.