Kishan Reddy: త్వరలో శ్రీశైలానికి అమిత్ షా

ABN , First Publish Date - 2022-08-31T04:25:08+05:30 IST

శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి కోసం ప్రధాని మోదీ (Pm Modi) ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

Kishan Reddy: త్వరలో శ్రీశైలానికి అమిత్ షా

నంద్యాల: శ్రీశైలం దేవస్థానం (Srisailam Temple) అభివృద్ధి కోసం ప్రధాని మోదీ (Pm Modi) ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) అన్నారు. స్వామి వారి దర్శనం కోసం త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) శ్రీశైలం రానున్నారని ఆయన చెప్పారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి చెందాలసిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్‌గా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిసారిగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నానన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్రప్రభుత్వం తరుపున 43 కోట్ల రూపాయలతో శ్రీశైలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం నిధులతో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయని.. వచ్చే నెలలో ఓపెనింగ్ చేసి భక్తులకు అంకితం చేయనున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-08-31T04:25:08+05:30 IST