AP News: శ్రీవారి ఆగష్టు నెల హుండీ ఆదాయం ఎంతంటే...

ABN , First Publish Date - 2022-09-01T14:58:42+05:30 IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతోంది.

AP News: శ్రీవారి ఆగష్టు నెల హుండీ ఆదాయం ఎంతంటే...

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం (Tirumal srivari temple)లో భక్తుల సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతోంది. వారాంతాలు, సెలవుల రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆగష్టు మాసంలో దాదాపు 22లక్షల 80వేల 84మంది భక్తులు స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే హుండీ ద్వారా శ్రీవారికి ఆగష్టు నెలలో రూ.140కోట్ల 7లక్షల ఆదాయం లభించింది. దాదాపు 10లక్షల 79వేల 900మంది భక్తులు తలనీలాలు సమర్పించిన ఏడుకొండ స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. 


Updated Date - 2022-09-01T14:58:42+05:30 IST