వైభవంగా శ్రీవారి కల్యాణం

ABN , First Publish Date - 2021-04-19T04:47:07+05:30 IST

తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల పరిధిలో ఆదివారం వేంక టేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీవారి కల్యాణం
వేంకటేశ్వరస్వామికి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు,

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 18: తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల పరిధిలో ఆదివారం వేంక టేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉభ య దేవాలయాల పరిధిలో ముందుగా ప్రత్యేక పూజ లను ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు, పి.గోపా లకృష్ణమాచార్యులు, కె.శ్రీనివాసాచార్యులు ఘనంగా నిర్వ హించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బి.లక్ష్మీ నగేష్‌ మాట్లాడుతూ స్వామివారి కల్యాణాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఉచిత అన్న దానానికి పలువురు తమవంతు సహకారం అందిస్తున్నారన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాలు, అన్నసమారాధన నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల నడుమ స్వామివారి దర్శనానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.


Updated Date - 2021-04-19T04:47:07+05:30 IST