
బెంగళూరు: ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 11 వరకు జరగనున్న ఎస్ఎస్ఎల్సీ పరీక్షలకు హాజరయ్యే నగర విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు బీఎంటీసీ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. కాగా కేఎస్ ఆర్టీసీ కూడా పరీక్షలకు హాజరయ్యే ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులు తమ హాల్టికెట్లను చూపించి పరీక్షాకేంద్రాల వరకు ఉచితం గా ప్రయాణించవచ్చునని తెలిపింది.
ఇవి కూడా చదవండి