పింఛన్ కోసం పడిగాపులు
ABN , First Publish Date - 2021-04-18T05:35:04+05:30 IST
మండల కేంద్రంలోని పోస్టాఫిసు వద్ద శనివారం పింఛన్ కోసం వచ్చిన వృద్ధురాలు సోమ్మసిల్లి పడిపోయింది.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 17: మండల కేంద్రంలోని పోస్టాఫిసు వద్ద శనివారం పింఛన్ కోసం వచ్చిన వృద్ధురాలు సోమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు ఆమెకు ప్రథమ చికిత్సను చేయడంతో స్పృహలోకి వచ్చింది. ఎండలో పింఛన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆమె తెలిపింది. పింఛన్ను సకాలంలో అం దించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొంది.
దోమకొండ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు భౌతిక దూరం పాటించాలని జడ్పీటీసీ తీగల తిర్మల్గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆనంద్భవన్లో పింఛన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.