పంట ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-09T04:09:26+05:30 IST
ప్రజామిత్ర రైతు సమాఖ్య ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని సంస్థ అధ్యక్షుడు దుండేరావు ప్రారంభించారు. స్థానిక న్యూబస్టాండ్ సమీపంలో శనివారం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సహజ పద్ధతులలో రైతులు పండించిన పంటలను రైతుల వద్ద కొనుగోలు చేసి వాటిని నేరుగా ఉ పయోగించే విధంగా ఇడ్లిమిక్స్, దోసమిక్, రాగిదోశమిక్, కందిపప్పు, శనగపప్పు, పెసరిపప్పులను విక్రయించడం జరుగుతుందన్నారు. విక్రయ కేంద్రం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ కుంరవిఠల్రావు, సోయంజగనిరావు, లక్ష్మీనారాయణ, ప్రశాంత్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, మే8: ప్రజామిత్ర రైతు సమాఖ్య ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని సంస్థ అధ్యక్షుడు దుండేరావు ప్రారంభించారు. స్థానిక న్యూబస్టాండ్ సమీపంలో శనివారం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సహజ పద్ధతులలో రైతులు పండించిన పంటలను రైతుల వద్ద కొనుగోలు చేసి వాటిని నేరుగా ఉ పయోగించే విధంగా ఇడ్లిమిక్స్, దోసమిక్, రాగిదోశమిక్, కందిపప్పు, శనగపప్పు, పెసరిపప్పులను విక్రయించడం జరుగుతుందన్నారు. విక్రయ కేంద్రం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ కుంరవిఠల్రావు, సోయంజగనిరావు, లక్ష్మీనారాయణ, ప్రశాంత్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.