ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-18T03:59:41+05:30 IST
మండల కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మన్ సంజీవ్, వైస్ ఛైర్మన్ రంగు మహేష్ గౌడ్ ప్రారంభించారు.
రెబ్బెన, మే 17: మండల కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మన్ సంజీవ్, వైస్ ఛైర్మన్ రంగు మహేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌందర్య ఆనంద్, జడ్పీటీసీ సభ్యుడు సంతోష్, ఎంపీటీసీ మధునయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సోమశేఖర్, గంగాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం, డైరెక్టర్లు కడతల మల్లయ్య, జైస్వాల్, టీఆర్ఎస్ నాయకుడు మోడెం సుదర్శన్, మహిళా నాయకురాలు కుందారపు శంకరమ్మ, శ్రీనివాస్, సంతోష్, ఏఈవోలు పరిమళ, శివకుమార్ పాల్గొన్నారు.