కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-21T05:38:34+05:30 IST
కరోనాను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.
పీలేరు, జనవరి 20: కరోనాను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక తిరుపతి మార్గంలోని ఉప ఖజానా కార్యాలయ భవన సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పీలేరులో ఏర్పాటు చేసిన కేంద్రంలో అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు తెలిపారు. కొవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ సొంత వైద్యం తీసుకొని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుందన్నారు. ఎంపీపీ కంభం సతీ్షరెడ్డి, జడ్పీటీసీ ఏటీ రత్నశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడప గిరిధర్రెడ్డి, పీలేరు సర్పంచ్ డాక్టర్ హబీబ్బాష, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కారపాకుల భాస్కర్నాయుడు, వైస్ ఎంపీపీ ఎన్వి.చలపతి, తహసీల్దార్ రవి, వైద్యాధికారి చంద్రశేఖర్నాయక్, నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.