కొవిడ్‌ కేర్‌ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-27T08:37:48+05:30 IST

సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలోని నూతన భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌కేర్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం బుధవారం ప్రారంభించారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రం ప్రారంభం
కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం

సత్యవేడు, జనవరి 26: సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలోని నూతన భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌కేర్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం బుధవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రిలో అందిస్తున్న కొవిడ్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో రవిరాజు, ఎంపీపీ ప్రతిమ, జడ్పీటీసీ విజయలక్ష్మి, తహసీల్దార్‌ శ్రీదేవి, ఎంఈవో రవి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ గిరీ్‌షకుమార్‌, ప్రభుత్వ వైద్యాధికారి డా. రమేష్‌, ప్రవీణ్‌కుమార్‌, వైసీపీ జిల్లా కార్మిక శాఖ అధ్యక్షుడు బీరేంద్రవర్మ, సింగిల్‌విండో అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీలు సరోజని, వెంకటరత్నమ్మ, సత్యవేడు సర్పంచ్‌ మంజుల, వైసీపీ నాయకులు బాలాజీరెడ్డి, విద్యానాథ్‌రెడ్డి, అపరంజిరాజు, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు మస్తానమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T08:37:48+05:30 IST