రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
ABN , First Publish Date - 2021-07-25T06:04:56+05:30 IST
పట్టణంలో శనివారం రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి.
ఎలమంచిలి, జూలై 24 : పట్టణంలో శనివారం రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. నాకౌట్ కమ్ లీక్ పద్ధతిలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను తొలుత వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్, పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆడారి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ క్రీడా రంగంలో ఎలమంచిలికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. ఇక్కడి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించారని తెలిపారు. తొలిరోజు చిట్టివలస, స్టీల్ప్లాంట్ జట్ల మధ్య జరిగిన పోటీల్లో స్టీల్ప్లాంట్ జట్టు విజయం సాధించింది. అసోసియేషన్ ప్రతినిధులు వీరప్రజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.