అమరవీరుల కోసం గర్జిద్దాం: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-09-17T22:46:43+05:30 IST
నిజాం రాజును ఎదురించి తమ ప్రాణాలను కోల్పోయిన వేయి మంది అమరవీరుల
నిర్మల్: నిజాం రాజును ఎదురించి తమ ప్రాణాలను కోల్పోయిన వేయి మంది అమరవీరుల కోసం గర్జిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిర్మల్లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసారు. రజాకార్ల వారసులు హింసించిన హిందూ సమాజానికి మనం భరోసా ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. వాళ్ల కోసం మనమంతా నినదించాలన్నారు. వేయి మంది అమరవీరుల కోసం గర్జిద్దామన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీది కీలక పాత్ర అని బండి సంజయ్ తెలిపారు.