రేపు రాష్ట్ర మహాసభలు
ABN , First Publish Date - 2021-12-04T05:45:56+05:30 IST
అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు క్లాస్-3, పోస్టుమెన్ అండ్ ఎంటీఎస్, ఏఐజీడీఎస్ ఉద్యోగుల సంఘాల రాష్ట్ర మహాసభలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు పీ-3 కార్యదర్శి కేపీ పక్కీరప్ప తెలిపారు.
కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 3: అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు క్లాస్-3, పోస్టుమెన్ అండ్ ఎంటీఎస్, ఏఐజీడీఎస్ ఉద్యోగుల సంఘాల రాష్ట్ర మహాసభలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు పీ-3 కార్యదర్శి కేపీ పక్కీరప్ప తెలిపారు. నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సంఘాల ఉమ్మడి ద్వైవార్షిక డివిజనల్ మహాసభలతో పాటు, అఖిల భారత తపాలా ఎస్బీసీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలు ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభ్యులందరూ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీ-4 కార్యదర్శి కె.ఈశ్వరయ్య, ఏఐజీడీఎస్యూ కార్యదర్శి కె.లక్ష్మీకాంత్, రాష్ట్ర కార్యదర్శి కె.శివప్రసాద్ పాల్గొన్నారు.