Prime Minister: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని ప్రశంసలు
ABN , First Publish Date - 2022-08-11T16:16:30+05:30 IST
చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pr
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 10: చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని తన ట్విట్టర్(Twitter)లో, అంతర్జాతీయ క్రీడాకారులకు భారతీయ, తమిళ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడమే కాకుండా, పసందైన విందు భోజనాలతో అతిథులను ఆకట్టుకున్నారని రాష్ట్రప్రజలు, రాష్ట్రప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.