అప్పుల ఊబిలోకి..!

ABN , First Publish Date - 2020-09-23T10:07:59+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 16 నెలల్లో రూ.1.28 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఏ రోజుకారోజు అప్పు పుడితే చాలు..

అప్పుల ఊబిలోకి..!

16 నెలల్లో 1.28 లక్షల కోట్ల అప్పులు 

తాజాగా 2,525 కోట్లకు కేంద్రం ఓకే 


అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 16 నెలల్లో రూ.1.28 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఏ రోజుకారోజు అప్పు పుడితే చాలు.. రోజు గడిస్తే చాలనే రీతిలో వ్యవహరిస్తోంది. తాజాగా ‘ఒన్‌ నేషన్‌- ఒన్‌ రేషన్‌’ కింద మరో రూ.2,525 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. అయితే తెచ్చిన లక్షల కోట్ల అప్పులను పెట్టుబడులకు, క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టుల కోసమో వినియోగిస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ, ఆ డబ్బంతా ఓటుబ్యాంకుపై కన్నుతో వివిధ వర్గాలకు పంచడానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల అటు రాష్ట్రానికి గానీ ఇటు లబ్ధి పొందిన ప్రజలకు గానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లు అమర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీనిపై కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖ రాశారు. దీన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే మరో రూ.4వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి లభించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-09-23T10:07:59+05:30 IST