రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

ABN , First Publish Date - 2022-04-06T17:28:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 1 నుంచి వర్తించేలా 2.75 శాతం కరువు భత్యం ఇవ్వనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

                                        - 2.75 శాతం కరువు భత్యం


బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 1 నుంచి వర్తించేలా 2.75 శాతం కరువు భత్యం ఇవ్వనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంగళవారం ట్వీట్‌ చేశారు. కరువు భత్యం విడుదలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు. కరువు భత్యం విడుదలతో ఖజానాపై ఏటా రూ.1447 కోట్ల మేరకు భారం పడనుంది. కరువు భత్యం విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ష డాక్షరి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-04-06T17:28:05+05:30 IST