చివరి దశకు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ
ABN , First Publish Date - 2022-05-29T05:40:25+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల ఫుట్బాల్ చాంపియన్షిప్ టోర్నీ చివరి దశకు చేరింది.
సెమీ ఫైనల్కు శ్రీకాకుళం, కడప, కర్నూలు, చిత్తూరు జట్లు
ఫైనల్కు చేరేది ఎవరో తేలేది నేడు
విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 28: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల ఫుట్బాల్ చాంపియన్షిప్ టోర్నీ చివరి దశకు చేరింది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ల్లో ఆతిథ్య విశాఖతోపాటు వెస్ట్ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప, ఈస్ట్ గోదావరి జట్లు పోటీపడ్డాయి. అయితే పాయింట్ల పట్టిక ప్రకారం శ్రీకాకుళం, కడప, కర్నూలు, చిత్తూరు జట్లు ప్రతిభ కనబరిచి సెమీఫైనల్స్కు చేరాయి. ఆదివారం జరిగే తొలి సెమీఫైనల్లో శ్రీకాకుళం-కడప, సెకెండ్ సెమీఫైనల్లో కర్నూలు-చిత్తూరు జట్లు తలపడనున్నాయి. శనివారం జరిగిన మ్యాచ్లకు క్యాట్-2 అర్హత కలిగిన జాతీయ సీనియర్ విపిన్ రిఫరీగా వ్యవహరించడం విశేషం.