రాష్ట్ర స్థాయి మహిళల క్యారమ్స్‌ ర్యాంకింగ్‌ టోర్నీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-03T06:07:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, విశాఖ జిల్లా క్యారమ్‌ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న 50వ రాష్ట్ర స్థాయి మహిళల క్యారమ్స్‌ ర్యాంకింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది.

రాష్ట్ర స్థాయి మహిళల క్యారమ్స్‌ ర్యాంకింగ్‌ టోర్నీ ప్రారంభం
క్రీడాకారిణికి జెర్సీ టీ షర్టు అందజేస్తున్న డాక్టర్‌ శర్మ తదితరులు

విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 2: ఆంధ్రప్రదేశ్‌, విశాఖ జిల్లా క్యారమ్‌ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న 50వ రాష్ట్ర స్థాయి మహిళల క్యారమ్స్‌ ర్యాంకింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. శివశివాని స్కూల్‌లో జరుగుతున్న ఈ పోటీలకు ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ రిఫరీ డాక్టర్‌ డీవీఎస్‌వై శర్మ ముఖ్య అతిఽథిగా హాజరై క్రీడాకారిణులకు జెర్సీ టీ షర్టులు పంపిణీ చేసి, మ్యాచ్‌లను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సంఘం అధ్యక్షుడు నీరజ్‌ సంపతీ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 23 మంది ర్యాంకింగ్‌ క్రీడాకారిణులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది మహిళలను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్టు వివరించారు. ఎంపికైనవారు త్వరలో న్యూఢిల్లీలో జరిగే జాతీయ మహిళల క్యారమ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యారమ్‌ సంఘం ప్రతినిధులు ప్రీతి సంపతీ, ఐ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-03T06:07:08+05:30 IST